జనసేన ఆత్మీయ సమావేశం

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జనసేన నాయకులు, వీర మహిళలు మరియు జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, జనసేన రాష్ట్ర కార్యక్రమాల కార్యనిర్వహణ ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, జనసేన రాయలసీమ ప్రాంతీయ మహిళ రీజనల్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలతల ఆధ్వర్యంలో ఘనంగా ఈ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర మహిళలు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన-టిడిపి-బిజెపి ఉమ్మడి అనంతపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకట ప్రసాద్ విచ్చేసి కూటమి సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేసి తనని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. జనసేన నాయకుల్ని, వీరమహిళలని, కార్యకర్తలని ప్రతి ఒక్కరిని పేరుపేరునా పలకరించి మీకు ఎల్లవేళలా నేను అన్ని విధాలుగా అందుబాటులో ఉంటానని, మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని తెలియజేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు అందరం కలిసికట్టుగా పని చేసి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన-టిడిపి-బిజెపి కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకట ప్రసాద్ ని గెలిపిస్తామని అనంతపురం అర్బన్ నియోజకవర్గం జనసేన నాయకులు, వీర మహిళలు మరియు కార్యకర్తలు హామీ ఇవ్వడం జరిగింది.