ఒట్టురు గ్రామ జనసేన నాయకులు, జనసైనికులతో సమావేశమైన అళహరి సుధాకర్

కావలి నియోజకవర్గం: రూరల్ మండలం, ఓట్టురు గ్రామ జనసేన నాయకులు, జనసైనికులతో కావలి నియోజకవర్గ ఇంఛార్జి అళహరి సుధాకర్, రూరల్ అధ్యక్షుడు, గుడిపల్లి వెంకయ్య అధ్యక్షతన శ్రీను ఆధ్వర్యములో సమావేశమై పార్టీ బలోపేతానికి రాబోయే రోజుల్లో తీసుకోవలసిన చర్యల గురించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అళహరి సుధాకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థముగా కేవలము రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జనసేన, టీడీపి, బీజేపీ కలవడానికి మన పార్టీ సీట్లను త్యాగము చేస్తే ఉమ్మడి అభ్యర్థిగా ఈ రోజు కావలి టికెట్టు టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కి ఇవ్వడము జరిగిందని, కావలిలో జనసేన ఓటింగ్ చాలా బలంగా ఉందని, మీలో చాలా మంది యువతకు ఈ రోజు ఎన్నో వేల ఓటింగ్ వచ్చిందని ఎంతంటే మన ఓటింగ్ లేకపోతే ఉమ్మడి టీడీపి అభ్యర్ధి గెలవలేనఒత అని అన్నారు. ఎన్నో కోట్లు సంపాదిఒచగల సత్తా ఉన్నా కేవలము మనకోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ వై సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న ఒకే ఒక్క సంకల్పంతో ఎన్ డి ఏలో టీడీపి చేరేలా చేసి మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేసేలా కృషిచేసిన మహనీయుడు మన పవన్ కళ్యాణ్ అని అలాంటి పార్టీని కానీ, పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన నాయకులను, పవన్ కళ్యాణ్ గారినీ కానీ విస్మరిఒచి ఎలక్షన్స్ కు వెళితే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసైకుల ఆత్మాభిమానం దెబ్బతినే ప్రమాదము ఉందని, నేను పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం గత 5సం.లు గా కావలిలో పనిచేసుకుంటూ వెళుతున్నానని అదే క్రమములో ఉమ్మడి అభ్యర్థికి మద్దతు తెలిపుతూ కావలి నియోజకవర్గంలో టీడీపి అభ్యర్ధి గుర్తు సైకిల్ మీదే ఓటువేసి గెలిపించవలసినదిగా ఈ ఒట్టురు గ్రామ జనసైనికులతో కలిసి ప్రచారం చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమములో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అద్యక్షుడు ఆలా శ్రీనాథ్, కృష్ణయ్య, నాగరాజు, నాయుడు భాస్కర్, అప్పనగిరి వెంకటరావు, చాపల హరికృష్ణ, విన్నీ బాబు, రసాని నాగార్జున, నవీన్, వంశీ, శశి, చందు, పవన్, కౌశిక్ తదితర నాయకులు పాల్గొన్నారు.