నాంపల్లిలో జనసేన ఆత్మీయ సమావేశం

మునుగోడు: జనసేన పార్టీ నాంపల్లి మండల కేంద్రంలో ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేన పార్టీ మునుగోడు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గోకుల రవీందర్ రెడ్డి విచ్చేసి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక మండల సమస్యలని అడిగి తెలుసుకున్నారు, ఈ కార్యక్రమంలో మండల నాయకులు శేఖర్, పూల నాగరాజు, గిరి, శివ, మదన్ కుమార్, మహేష్, శ్రీశైలం, ఆంజనేయులు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.