కొనతాలపల్లి గ్రామంలో జనసేన ఆత్మీయ సమావేశం

నందిగామ నియోజకవర్గం, జనసేన పార్టీ నందిగామ నియోజకవర్గం వీర్లపాడు మండలం, కొనతాలపల్లి గ్రామంలో జనసేన పార్టీ నాయకులు మరియు జనసైనికులతో ఆత్మీయ సమావేశంలో నందిగామ జనసేన-టిడిపి సమన్వయ బాద్యులు శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో జనసేన-టిడిపి కూటమికి కలిసి సమిష్టిగా అందరూ పనిచేయాలని సూచించారు. బూత్ కమిటీలు వేసి పోలింగ్ బూతులు దగ్గర జనసైనికులు ఎలా వ్యవహరించాలి, ఎలాంటి సూచనలు పాటించాలో వారందరికీ శిక్షణా తరగతులు నిర్వహించడానికి త్వరలో ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బేతన పూడి జయరాజు శ్రీనివాసరావు, టి.సాయి ధరం, ఎస్.సీతారామయ్య, కె.ఈశ్వర్ కుమార్, వి.రమేష్, వి.ఆంజనేయులు, జి.గోపి, టి.అజయ్, ఎస్.వెంకీ, వెంకటేష్, టి.అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.