ప్రత్తిపాడులో జనసేన ఆత్మీయ సమావేశం

  • 50 వేల విరాళం ప్రకటించిన వరుపుల తమ్మయ్యబాబు

ప్రత్తిపాడు నియోజకవర్గం, ఏలేశ్వరం మండలంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు పెంటకోట మోహన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు పాల్గొన్నారు. మండల అధ్యక్షులు పెంటకోట మోహన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రజల్లోకి జనసేన పార్టీ విధానాలు, సిద్ధాంతాలు ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్లాలి అలాగే గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం గురించి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్యబాబు మాట్లాడుతూ పార్టీకి అండగా మన వంతు భాద్యతగా విరాళాలు అందించే “నా సేన కోసం…. నా వంతు…” కార్యక్రమం గురించి దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా సెప్టెంబర్ 2వ తేదీన మన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చేపట్టబోయే కార్యక్రమాల గురించి కూడా చర్చించటం జరిగింది. మన పార్టీకి డొనేషన్ 50 వేల రూపాయల చెక్కును నియోజకవర్గ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్యబాబు ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయకర్త పెంటకోట చంటిబాబు, ఏలేశ్వరం మండల టౌన్ ప్రెసిడెంట్ అధికార్, మండల ఉపాధ్యక్షులు పలివేల వెంకటేష్, అచ్చే వీరబాబు, శంఖవరం మండల వైస్ ప్రెసిడెంట్ సుంకర చక్రి, జనసేన నాయకులు, వివిధ గ్రామాల అధ్యక్షులు, జనసైనికులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.