జనసేన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న బొర్రా

సత్తెనపల్లి: ముప్పాళ్ళ మండలం, రుద్రవరం గ్రామంలో శనివారం సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు రుద్రవరం గ్రామ అధ్యక్షుడు సుబ్బారావు మరియు పులిచర్ల ప్రసాద్ ఆహ్వానం మేరకు రుద్రవరం గ్రామ జనసైనికులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగినది. బొర్రా వెంకటా అప్పారావు గ్రామస్తులను ఉద్దేశించి రానున్న రోజుల్లో గ్రామంలో మరింత బలోపేతం చేయాలని అనేక కార్యక్రమాలు చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని గ్రామస్తులకు జనసైనికులకు దేశాన్ని నిర్దేశం చేయడం జరిగింది. గ్రామ జనసైనికులుఅందరూ కలిసి బొర్రా వెంకట అప్పారావు గారిని శాలువాతో సన్మానించడం జరిగింది. గ్రామంలో క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముప్పాళ్ళ మండలం అధ్యక్షుడు సిరిగిరి పవన్ కుమార్ గ్రామ అధ్యక్షుడు కొమర సుబ్బారావు పులిచెర్ల ప్రసాద్, పులిచెర్ల అప్పారావు, విర్ల బోళ్ళయ, కొప్పుల శంకర్, కొప్పుల లోతురాజు, మోరబోయిన శ్రీనివాసరావు, మురారి వెంకట్రావు, నంబూరి కొండ కొమర పేరయ్య, పొత్తూరి మోహన్ రావు, చేబ్రోలు యోగేశ్వరరావు, రుద్ర జడ బుల్లబ్బాయి, షేక్ బాషా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.