రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ లో పతకాలు సాధించిన ఎస్.జి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు

విజయవాడ, తమ విద్యార్థులు స్కూలుకి పతకాలు తీసుకురావడం గర్వంగా ఉందని ఎస్.జి స్కూల్ ప్రిన్సిపల్ రాజిపూర్ణ తెలిపారు. శ్రీహాన్ బంగారు పతకం, కుశాల్ వెండి పతకం, కౌశిక్ వెండి పతకం అద్విక్ మూడవ స్థానంలో పతకం సాధించడం జరిగింది. ఈ సందర్భంగా గోజూరి కరాటే ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ అండ్ ఎగ్జామినర్, జనసేన రాష్ట్ర నాయకులు, న్యాయవాది, నేషనల్ హ్యూమన్ రైట్స్ జాయింట్ సెక్రటరీ హనుమాన్ మాట్లాడుతూ కరాటే అనేది పిల్లలకు ఆత్మరక్షణగాను, ఆరోగ్యంగా ఉండడానికి కరాటే అనేది చాలా అవసరం అని, ఈ రోజుల్లో జరిగిన సంఘటనలు ముఖ్యంగా ఆడపిల్లలకు ఆత్మరక్షణ అనేది చాలా కీలకమైన శిక్షణగా తల్లిదండ్రులు గుర్తించాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆత్మరక్షణ విద్య నేర్చుకోవాలని తెలిపారు.