అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి అండగా జనసేన

పిఠాపురం: విఆర్ పురం మండలం, సీతంపేట గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైన ఇంటిని, కుటుంబ సభ్యులను జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ములకాల సాయికృష్ణ ఆధ్వర్యంలో పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కుర్ల రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ భారీ ఆస్తి నష్టం జరిగిందని, కట్టుబట్టలతో బయటపడ్డ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ తరఫున పదివేల రూపాయలు ఆర్థిక సహాయం మరియు నిత్యవసర సరుకులు, చీరలు లుంగీలు టవల్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంపచోడవరం మండల అధ్యక్షులు పాపోలు శ్రీను, ఎటపాక మండల అధ్యక్షులు మారాసు గంగాధర్, చింతూరు మండల నాయకులు పెద్దా, కొనతం శ్రీనివాస్, మండల నాయకులు కెచ్చల పోసిరెడ్డి, బాగుల అంజనరావు, మండల యూత్ నాయకులు పెడ పెట్ల పవన్ కళ్యాణ్, కోట్ల సాయిబాబు, ముంజపు సాయి, పండు దుర్గా ప్రసాద్, వెంకన్న, వాళ్ళ సాగర్, నందు, సాయి, వంశీ కుమార్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.