ఇంటింటికి జనసేన ప్రారంభించిన

అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, ఇంటింటికి జనసేన – పవన్ రావాలి పాలన మారాలి అనే కార్యక్రమాన్ని సోమవారం జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ప్రారంభించారు. ముందుగా ముమ్మిడివరం మండలం భట్నవిల్లి శ్రీ విజయ దుర్గమ్మ వారి ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి, అలాగే నూతన ప్రచార రధమునకు ప్రత్యేక పూజలు నిర్వహించి, వారి తల్లిగారైన పితాని సత్యవతి ఆశీర్వచనం తీసుకుని, సీతారాముల వారిని దర్శించి, అలాగే శెట్టిపేట గ్రామదేవత శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారిని దర్శించి, ఆశీస్సులు తీసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామంలోని శెట్టిపేట, పెట్టావారి పేట, బాలయోగి కాలనీ, పెయ్యలవారిపేట, వాసంశెట్టి వారి పాలెంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయమని కోరడం జరిగింది. అలాగే గ్రామాలలో ఉన్న వివిధ సమస్యల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. రానున్న రోజులలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మా ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేస్తానని బాలకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగ చైర్మన్ మరియు నరసాపురం నియోజకవర్గం ఇంచార్జ్ బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గం నాలుగు మండలాల అధ్యక్షులు, వీరమహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.