ఆత్మహత్య చేసుకున్న విశ్రాంత ఉద్యోగి బౌతిక కాయానికి నివాళులర్పించిన పితాని బాలకృష్ణ

రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడమేగాక, గ్రామానికి చెందిన ఓ వైకాపా నాయకుడు ప్రొద్భలంతో వేదింపులకు గురిచేస్తున్నారని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న అయినాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం విశ్రాంత ఉద్యోగి రాయపురెడ్డి కృష్ణమూర్తి బౌతికకాయాన్ని అయినాపురంలో అయన స్వగృహంమునందు దర్శించి.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారిని ఓదార్చి.. వారికి న్యాయం జరిగే వరకూ జనసేన పార్టీ అండగా ఉంటుందని రాష్ట్ర పి.ఏ.సి. సభ్యులు ముమ్మిడివరం జనసేన పార్టీ ఇంచార్జి పితాని బాలకృష్ణ తెలియజేశారు. వారితో జనసేన నాయకులు సానబోయిన మల్లికార్జున రావు, గోదాశి పుండరీష్, గోలకోటి వెంక్కన్న బాబు, గోలకోటి ఫణి, దూడల స్వామి, మొదలగువారు పాల్గొన్నారు.