ఏలూరులో ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట

ఏలూరు నియోజకవర్గంలోని 1వ డివిజన్ కోడేలు హమాళీ కాలనీలో ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట కార్యక్రమంలో భాగంగా రౌడీ ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడాలని బెదిరింపులతో, దౌర్జన్యాలతో పరిపాలన ఎక్కువ కాలం నిలబడవని అధికార పార్టీ వైసీపీ కీ రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం ప్రజలు చెబుతారని జిల్లా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ ఏలూరు ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ రెడ్డి అప్పల నాయుడు హెచ్చరించారు. స్థానిక డివిజన్ లోని ప్రతి గడపలో అనేక సమస్యలతో సతమతమవుతున్న ప్రజలను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. కేవలం ఎన్నికల సమయంలో ఓట్లకు ఇంటింటికి తిరిగి అది చేస్తాం ఇది చేస్తాం అని నమ్మించి మోసం చేసి ప్రజలను వంచించడం సరైన విధానం కాదని ప్రజా సమస్యల పై జనసేన పోరుబాట కార్యక్రమంలో ప్రజలకు రాబోయే కాలంలో జనసేన పార్టీ అండగా ఉంటామని స్థానిక ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ మూడేళ్ల కాలంలో ప్రతి సమస్య మీద తన గళం విప్పి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించి, ప్రతి సమస్య నీ పరిష్కరించే విధంగా ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పించి రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి బుద్ది చెప్పే విధంగా షణ్ముఖ వ్యూహంతో 2024 ఎన్నికలకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.. కాబట్టి ప్రజల తరఫున నిరంతరం శ్రమించే పవన్ కళ్యాణ్ ని ఆశీర్వాదించాలని రెడ్డి అప్పల నాయుడు కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి మరియు జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.