నిజాం కాలేజ్ లో జనసేన విద్యార్థి విభాగం శ్రేణుల సమావేశం

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ తరువాత అత్యంత ప్రతిష్టాత్మకమైన నిజాం కాలేజ్ లో జనసేన విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేయడానికి శనివారం నిజాం కాలేజ్ జనసేన విద్యార్థి విభాగ శ్రేణులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మిరియాల హాజరై విద్యార్థి సమస్యలపై పోరాడటానికి జనసేన విద్యార్థి విభాగం ఆవశ్యకతని వివరించారు. జనసేన విద్యార్థి విభాగం బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి వివరించారు. త్వరలోనే నిజాం కాలేజ్ కమిటీలను కూడా ప్రకటించడం కూడా జరుగుతుంది అని ప్రకటించారు. ఈ సమావేశంలో విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి మొకారల కృష్ణ, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మహేష్ పెంటల, ఓయూ ప్రెసిడెంట్ వినోద్, ఓయూ కమిటీ సభ్యులు పొన్నం పవన్, నిజాం కళాశాల విద్యార్థి నాయకులు మోతిలాల్, సాయి రాజ్, లవన్, మహేష్, సందీప్, వెంకటేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.