పెమ్మరాజు పోలవరంలో జనసేన స్థూపం ప్రారంభోత్సవం

ఆచంట నియోజకవర్గం, పోడూరు మండలం, పెమ్మరాజు పోలవరం గ్రామంలో గల్ఫ్ యన్.అర్.ఐ నాయకులు మరియు “గల్ఫ్ సేన – జనసేన” సభ్యులు సతీష్ ఆధ్వర్యంలో జనసేన స్థూపం ప్రారంభోత్సవం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్య అతిధులుగా ఆచంట నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ చేగొండి సూర్య ప్రకాష్, తణుకు నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ విడివాడ రామ చంద్రరావు, వీరవాసం మండలం జడ్.పి.టీ.సి శ్రీ గుండా జయ ప్రకాష్, జనసేన వీరమహిళ శ్రీమతి కాట్నం విశాలి లక్ష్మి, పెమ్మరాజు పోలవరం 1వ వార్డు జనసేన మెంబర్ పిల్ల రత్నంమాణిక్యం(రాంబాబు), 7వ వార్డు జనసేన మెంబర్ చోపావరపు మధుకృష్ణ మరియు జనసేన నాయుకులు జగదీష్, మణికంఠ, సతీష్, హేమ, నాగరాజు, సాయి, తాతజీ, దుర్గారావ్, గిరి, సాయి, కార్యాకర్తలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జనసేన సిద్దాంతాలు జనసేన ఆశయాల గురించి మాట్లాడి జనసేన స్థూప కార్యక్రమం విజయవతం చేశారు.