వీరన్నబాబు సంబరంలో పాల్గొన్న జనసేన నాయకులు

  • లింగోలు వారి ఇంట అంగరంగ వైభవంగా వీరన్నబాబు సంబరం

అమలాపురం నియోజకవర్గ జనసేన నాయకులు లింగోలు వారి ఇంటివద్ద సోమవారం ఉదయం వీరన్నబాబు సంబరం అంగరంగ వైభవంగా జరిగింది. సంబరాలలో భాగంగా పూజ కార్యక్రమాలు, అనంతరం అన్నసమారాధన మరియు రాత్రికి శూలాల సంబరం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సంబరాలలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని, స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాజానగరం జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామ కృష్ణ సతీమణి శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, అమలాపురం మండల ఎంపీపీ కూడుపూడి భాగ్యలక్ష్మి (బాబు), అమలాపురం మునిసిపల్ చైర్మన్ రెడ్డి సత్యనాగెంద్ర మణీ తదితరులు పాల్గొన్నారు.