రైతు సంఘాల తరుపున జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చిన జనసేన

శ్రీకాకుళం జిల్లా రైతు సంఘాలు అఖిలపక్షం తరుపున రైతుల తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి మరియు దళారుల దోపిడీని అరికట్టి ప్రభుత్వం నిర్ణయించిన రేట్ నే కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ ని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జనసేన – బిజెపి సమన్వయ కర్త శ్రీ పేడాడ రామ్మోహన్ రావు రైతు సంఘాల జిల్లా నాయకులు బుడితి అప్పలనాయుడు, రాజు, నీలం రాజు, భాస్కరరావు, దుర్గారావు, దనుంజయ రావు తదితరులు పాల్గున్నారు.