ఆర్థిక ఇబ్బందులలో ఉన్న పలు కుటుంబాలకు జనసేన అండ

ఇచ్ఛాపురం నియోజకవర్గం, కవిటి మండలం, వరక పంచాయితీ సన్యాసిపుట్టుగ గ్రామంలో నర్తు తులసిరావు గత కొన్ని రోజుల నుంచి కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నారు. అతనికి 10 డయాలసిస్ లు అయినా కూడా ప్రభుత్వ నుండి ఎటువంటి పెన్షన్ కూడా రావట్లేదు. అతని ఆర్థిక పరిస్థితి బాగులేదని తెలుసుకున్న జనసైనికులు కొంత అర్ధిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అందులో భాగంగా శుక్రవారం ఇచ్ఛాపురం నియోజక వర్గ జనసేన పార్టీ సమ్వయకర్త కర్త దాసరి రాజు చేతులు మీదగా 5000 రూపాయలు అతనికి అందించారు.

అదే గ్రామానికి చెందిన నర్తు భీమయ్య పొట్ట కూటి కోసం బిలాయికి వెళ్తే అక్కడ కొద్ది రోజులు కిందట ప్రమాదం జరిగి కాళ్ళు విరిగిపోవడం జరిగింది. అతని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని తెలిసి అతనికి కూడా 5000 రూ ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంచిలి జెడ్పీటీసీ అభ్యర్థి డొక్కరి ఈశ్వర్ రావు, ఇచ్ఛాపురం మున్సిపాలిటీ 9,10 వార్డుల
ఇంఛార్జిలు సంతోష్ మహరానా, రోకళ్ళ భాస్కర్ రావు, మన్మధ, రామకృష్ణ మరియు గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.