తెలంగాణ ఉద్యమకారుల పాదయాత్రకు జనసేన మద్దతు

పాల్వంచ: పాల్వంచ తెలంగాణ ఉద్యమకారుల పాదయాత్రకు, పాల్వంచ మండల జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో బలిదానాలను చేసి ఏర్పరచుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఉద్యమకారులను గుర్తించకపోవడం వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించక పోవడం చాలా బాధ కలిగించే విషయం. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు మీరు ఒక ఉద్యమకారుడై అయ్యుండి వారిని పట్టించుకోకపోవడం, వారికి తగిన గుర్తింపు ఇవ్వకపోవడం ఇది కరెక్ట్ కాని విషయం. మీ ఉద్యమకారుల పాదయాత్రకు అడుగడుగునా జనసేన పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతూ, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని త్వరగా వాళ్ళ డిమాండ్ తీర్చాలని జనసేన పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరుతుంది. ఈ పాదయాత్రలో పాల్వంచ మండల అధ్యక్షుడు ఓలపల్లి రాంబాబు, మండల కార్యదర్శి, దేవ గౌడ్, బ్రహ్మం, సెక్రటరీ, బాలాజీ, మరియు మార్గం సందీప్ తదితరులు పాల్గొన్నారు.