Nellore: అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి జనసేన బాసట

• వస్త్రాలు, నిత్యవసరాల వితరణ
• ఇంటి పునర్నిర్మాణానికి హామీ

నెల్లూరుజిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండల పరిధిలోని మామిడిపూడి గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో శ్రీ నల్లబోతు వెంకటేశ్వర్లుకు చెందిన పూరిల్లు పూర్తిగా దగ్దం అయ్యింది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబం కట్టుబట్టలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న జనసేనపార్టీ నాయకులు శ్రీ బొబ్బేపల్లి సురేష్ నాయుడు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిత్యవసర సరుకులు, నూతన వస్త్రాలు అందించారు. ఇల్లు కోల్పోయిన ఆ నిరుపేద కుటుంబానికి అదే స్థానంలో రేకులతో కూడిన ఇల్లు నిర్మించి ఇస్తామని ఈ సందర్భంగా శ్రీ బొబ్బేపల్లి సురేష్ నాయుడు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ గిరీష్, శ్రీ వాసు, శ్రీ శేఖర్, శ్రీ నాగేంద్ర, శ్రీ సుమన్, శ్రీ సందీప్, శ్రీ అవినాష్ తదితరులు పాల్గొన్నారు.