జనసేన ప్రజాబాట ఆరవ రోజు

ఎచ్చెర్ల, జనసేన ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకులు అర్జున్ భూపతి ఆధ్వర్యంలో శుక్రవారం జి.సిగడాం మండలం వాండ్రంగి గ్రామంలో ఇంటి ఇంటికి వెళ్ళినప్పుడు లక్ష్మణరావు అనే రైతు తన ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రాన్ని నాశనం చేసేసింది. స్థానిక ఎమ్మెల్యే ఇప్పటివరకు కనీసం కనబడలేదు. ఇచ్చిన హామీలు అన్ని ఎక్కడ పెట్టారు అని తన ఆవేదన వ్యక్తంచేశారు. పవన్ కళ్యాణ్ పరిపాలనతో అయినా ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఎదురు చూస్తున్నామని చెప్పటం జరిగింది. అర్జున్ భూపతి మాట్లాడుతూ… రాష్ట్ర బాగోగులు కోసం ప్రతి ఒక్కరు తప్పకుండా ఈసారి ఆలోచించి పవన్ కళ్యాణ్ కి ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిమీద వుందిఉందని వివరించారు.