అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి జనసేన ఆసరా

గుంటూరు జిల్లా, పొన్నూరు నియోజకవర్గానికి చెందిన కట్టెంపూడిలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఓ నిరుపేద ఇల్లు అగ్నికి ఆహుతయ్యింది. విషయం తెలుసుకున్న పొన్నూరు నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకురాలు శ్రీమతి బోని పార్వతీనాయుడు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తనవంతుగా కొంత మొత్తం ఆర్ధిక సాయాన్ని ఆ కుటుంబానికి అందచేశారు. ప్రభుత్వం నుంచి పరిహారం వచ్చేలా ఒత్తిడి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీ రామయ్య, శ్రీ సుబ్బారావు, స్థానిక జనసైనికులు పాల్గొన్నారు.