అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ముదినేపల్లి జనసేన

కైకలూరు నియోజకవర్గం, ముదినేపల్లి మండలం. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా.. ముదినేపల్లి బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఆయన విగ్రహానికి పులమాలు వేసి ఆ మహనీయునికి ఘననివాళులు అర్పిస్తూ.. అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలనే.. ఆయన ఆశయ సాధన కోసం జనసేన పార్టీ కృషి చేస్తుందని జనసేన పార్టీ మండల అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, కైకలూరు నియోజకవర్గ నాయకులు పోకల కృష్ణా, మండల నాయకులు, అంబుల భరత్, వడ్లని ఆంజనేయులు, చెన్నింటి అనుకుమార్, జనసైనికులు పాల్గొన్నారు.