అరకులో జనసేన-టిడిపి ఆత్మీయ సమావేశం

అరకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రివర్యులు కిడారి శ్రావణ్ కుమార్, జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డాక్టర్ వంపూరు గంగులయ్య, అరకు జనసేన-టీడిపి చేట్టి చిరంజీవి అధ్యక్షతన జనసేన-తెలుగుదేశం పార్టీల ఆత్మీయ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకుడు బంగారు రామదాసు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఉద్దేశించి బంగారు రామదాసు అరుకు జనసేన పార్టీ నాయకుడు మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన పార్టీ తెలుగు దేశం పార్టీల పొత్తు శుభాపరిణామని, ఈవైసీపీ ప్రభుత్వం అరాచాక పాలనకు చరమగీతం పాడాలంటే రెండు పార్టీలో ఉమ్మడిగా కలిసి పోరాటం చేయాలని అరకు నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీల సమన్వయంతో ముందుకు వెళ్లి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించే విధంగా అందరూ కష్టపడి పని చేయాలని సూచించారు. అదేవిధంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏదైతే ఆదేశిస్తారో, ఏవైతే సూచనలు చేస్తారో ఆ సూచనలకు ప్రతి ఒక్కరు కట్టుబడి ముందుకు కొనసాగాలని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శ్రావణ్, కిలో బాబురావు, చిట్టి ఆనంద్, దురియా సాయిబాబా, ముత్యం ప్రసాద్, సిదేరి ధర్మేశ్వరరావు, చిట్టెం మురళి, కొన్నేడీ లక్ష్మణరావు, పవన్ కళ్యాణ్ రత్నప్రియ పరాదని సురేష్ ప్రవీణ్ కుమార్ సురేష్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.