కొయ్యలగూడెంలో జనసేన-టిడిపి సమన్వయ సమావేశం

పోలవరం, కొయ్యలగూడెం టౌన్ లో పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ సమావేశానికి జనసేన పార్టీ ఇన్చార్జి చిర్రి బాలరాజు, టిడిపి ఇన్చార్జ్ బొరగం శ్రీనివాసులు అధ్యక్షతన జనసేన పార్టీ పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, జిల్లా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే ఇరు పార్టీలకు సంబంధించిన ఏడు మండలాల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, మండల కమిటీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయా మండలాల్లో ఉండే సమస్యలు గురించి, ఉమ్మడి కార్యాచరణ గురించి, రెండు పార్టీలు కలిసి ప్రజల్లోకి చైతన్యం తెచ్చేలా ప్రణాళికలు, ఉమ్మడి మేనిఫెస్టో, రెండు పార్టీల అధ్యక్షులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు చేయవలసినటువంటి కార్యచరణ గురించి చర్చించడం జరిగింది. అరాచక పాలన పోవాలన్నా ప్రజలు సంతోషంగా ఉండాలన్నా ఈ ప్రభుత్వం పోవాలి అన్నారు.