జనసేన, టిడిపిల ఆత్మీయ సమన్వయ సమావేశం

ఏలూరు: సమిష్టిగా పనిచేసి వైసిపికి డిపాజిట్లు లేకుండా చేసి, అరాచక పాలనకు చమర గీతం పాడి ఏలూరు నియోజకవర్గంలో ఘన విజయం సాధిస్తామని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు, తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ కార్యాలయంలో గురువారం జనసేన, టిడిపి పార్టీల ఆత్మీయ సమన్వయ సమావేశం జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న రెడ్డి అప్పలనాయుడు, బడేటి చంటి మాట్లాడుతూ టికెట్ ఎవరికి ఇచ్చినా విజయమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. వైసీపీ అంతమే తమ ఏకైక లక్ష్యం అన్నారు. వైసీపీ పతనం ఖాయమైందని, ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మారుస్తున్నారన్నారు. జగన్ ను ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధమయ్యారన్నారు. ప్రజా సంక్షేమానికి, భావి తరాల భవిష్యత్తు కోసం, మంచి సమాజం నిర్మాణానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. క్రిమినల్స్ జగన్ రెడ్డి, అతని గ్యాంగ్ జైలుకు వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కుట్రపూరితమైన ఆలోచనతో వైసీపీ గ్యాంగ్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని టిడిపి, జనసేన కార్యకర్తలందరూ తిప్పి కొట్టి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. ఇరువురిలో ఎవరికి టిక్కెట్టు ఇచ్చినా పూర్తి సహకారంతో విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఇరు పార్టీల్లోని నాయకులు, కార్యకర్తల్లో ఎటువంటి విభేదాలు లేవన్నారు. దుర్మార్గమైన, అరాచక పాలన చేస్తున్న వైసిపి పార్టీ మొత్తాన్ని గంగా నదిలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జనసేన, టిడిపి మైత్రీ బంధం బలంగా ఉందని బడేటి చంటి, రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టిడిపి సీనియర్ నాయకులు పాలి ప్రసాద్, ఉప్పాల జగదీష్ బాబు, పెద్దిబోయిన శివప్రసాద్, చోడే వెంకటరత్నం, మరడాని రంగారావు, పూజారి నిరంజన్, మారం హనుమంత రావు, లంకపల్లి మాణిక్యాలరావు జనసేన పార్టీ నాయకులు సిరిపల్లి ప్రసాద్, బీవీ రాఘవయ్య చౌదరి, దోనేపూడి లోవరాజు, ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నిమ్మల జ్యోతి కుమార్, జనసేన, టిడిపి నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకురాళ్ళు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.