జనసేన టీడీపీల ఇంటింటి పాదయాత్ర

నూజివీడు: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు జనసేన టీడీపీ కూటమి నాయకుల ఆదేశాల మేరకు మిత్రధర్మం అనుసరించి జనసేనాని చెప్పిన ప్రకారం శనివారం బాబు షురూటి.. భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నూజివీడు నియోజకవర్గంలో వడ్లమాను గ్రామంలో ఇంటింటికి పాదయాత్ర చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆశయాలు బాబు భరోసా భవిష్యత్ గ్యారెంటీ కింద ఉమ్మడి మ్యానిఫెస్టోను గడప గడపకు తీసుకెళ్లడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో పాలన అప్పులకుప్ప చేసి అభివృద్ధి లేకుండా సర్వ నాశనము చేసిన జగన్ ప్రభుత్వానికి అందరూ చరమ గీతం పాడాలి అని టీడీపీ జనసేన నాయకులు ప్రజలకు వివరణాత్మకముగా ప్రజలకు తెలపడం జరిగింది. రైతులు అన్ని వర్గాల ప్రజలు పీకల్లోతు కష్టాల్లో ఉంటే ఆయా అంశాలను గాలికొదిలేసి వైకాపా మంత్రులు సామాజిక సాధికార పేరుతో బస్సు యాత్రలను నిర్వహించడమేంటని అన్నారు. ఆగిరిపల్లి మండలం, వడ్లమాను గ్రామంలో 2వ రోజు బాబు ష్యురిటీ – భవిష్యత్తుకు గ్యారేంటి కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ లు ప్రతి ప్రజా సమస్యలపై పోరాడుతున్నరు అని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ముమ్మలనేని సునీల్ కుమార్, నియోజకవర్గ జనసేన నాయకురాలు వీరమహిళ రామిసెట్టి తేజస్విని, జనసేన పార్టీ నూజివీడు మండల కార్యదర్శి చేరుకుపల్లి కిషోర్ మరియు వడ్లమాను గ్రామ జనసైనికుడు లోకేష్, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వడ్లమాను తెలుగుదేశం నాయకులు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.