దామలచెరువు పంచాయతీ ముఖ్య నాయకుల సమావేశం

చంద్రగిరి నియోజకవర్గం: దామలచెరువు పంచాయతీకి సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం నిర్వహించడం జరిగింది. రానున్న 2024లో ఉమ్మడి జనసేన – టీడీపీ పార్టీల కార్యాచరణ, కార్యక్రమలు పంచాయతీలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశంపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం. నాసీర్, పాకాల మండల ఉపాధ్యక్షులు దినేష్, పాకాల మండల ప్రధాన కార్యదర్శి రహంతుళ్ళ, కార్యదర్శి కె. షాజహాన్, జనసేన నాయకులు నౌమూన్, అరుణ్, మస్తాన్, చందా, తాహీర్, అసిఫ్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.