సర్వేపల్లిలో జనం కోసం జనసేన 30వ రోజు

సర్వేపల్లి నియోజకవర్గం: తోటపల్లి గూడూరు మండలం, చిన్నచెరుకూరు గిరిజన కాలనీ నందు ఆదివారం జనం కోసం జనసేన 30వ రోజు కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు నిర్వహించారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. మరి రోజమ్మ గతంలో మొదట సినీ పరిశ్రమలోకి వచ్చి కొంతకాలం నటించి అక్కడ అవకాశాలు తగ్గిపోవడంతో సైకిల్ ఎక్కి ఆ సైకిల్ మీ యొక్క బరువును మోయలేక సైకిల్ చైన్ తెగిపోవడంతో కొంతకాలం హెరిటేజ్ ఐస్ నోట్లో పెట్టుకొని జబర్దస్త్ లో కొనసాగారు. వెంటనే ఫ్యాన్ కింద కూర్చున్నారు మీ అదృష్టం బాగుంది గెలవడం మంత్రి ఆవడం జరిగింది. అటువంటి మీరు కూడా మా అధినేతపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. రోజా గారు ముందు మీకు ఇచ్చిన పర్యాటక శాఖ మంత్రి పదవి గురించి మీరు ఏమి తెల్లార్చారు. దానిమీద దృష్టి పెట్టండి. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 175 స్థానాలో పోటీ చేయాలా వద్ద అనే విషయం ఆయన చూసుకుంటారు. మీరు రేపు 151 స్థానాల్లో కనీసం ఒక 60 స్థానాలో అయినా గెలుస్తారో లేదో దానిమీద దృష్టి పెట్టుకోమ్మా, అంతేగాని పాచి నోరు వేసుకొని ఏదంటే అది మాట్లాడితే తమరికి దీటుగా సమాధానం చెప్పడానికి జనసైనికులు సిద్ధంగానే ఉన్నారు. మీ ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం ఎవరూ చూస్తూ ఊరుకోరు. ఇప్పటికీ రెండు పార్టీలు మారినా మీరు మూడో ప్రత్యామ్నాయ పార్టీ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ విషయం అందరికీ తెలుసు కాబట్టి. మీరు ఏదో మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినంత మాత్రాన మాకు నష్టం లేదు. మీకు ఒరిగేది కూడా ఏమీ లేదు. ఇంతకుమించి పదవులు కూడా రావు. ఈ సారి మీరు గెలవరు గెలవలేరు అనే విషయం గుర్తుపెట్టుకోండి. డిపాజిట్లు కూడా రావు. మీరు పోటీ చేసే నగిరి నియోజకవర్గంలోనే మిమ్మల్ని డిపాజిట్లు కూడా లేకుండా ఓడించి పంపిస్తారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఈ కార్యక్రమంలో శ్రీహరి, ఖాజా, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, ఇనయ్ తుల, వంశీ సాయి తదితరులు పాల్గొన్నారు.