జనసేన-తెలుగుదేశం ప్రతి ఇంటికి జనసేన 30వ రోజు

మదనపల్లి, జనసేన-తెలుగుదేశం ప్రతి ఇంటికి జనసేన ప్రచారంలో భాగంగా 30వ రోజు నీరుగట్టు వారి పల్లిలో వివేకానంద స్కూల్ మరియు పెద్ద ట్యాంకు, గాలి మిషన్ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయులు మరియు జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత నాయకత్వంలో మైనార్టీ నాయకుడు షేక్ యాసీన్ అధ్యక్షతన జనసేన సోను, సుప్రీం హర్ష, గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పట్టణ ప్రధాన కార్యదర్శి లక్కసముద్రం కిరణ్ కుమార్ రెడ్డి, అశ్వత్ రాయల్, తుపాకుల ధరణి రాయల్ కోటకొండ చంద్రశేఖర్, బహదూర్, రెడ్డప్ప, చిన్న, దేవా, రమణమ్మ, కృష్ణమూర్తి, లోహిత్ శంకర్, చందన తదితర జనసైనికులు స్థానిక మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా జనసేన తెలుగుదేశం కూటమిని గెలిపిస్తామని ముక్తకంఠతో ఈ సందర్భంగా తెలియజేశారు.