ప్రతీ ఇంటికి జనసేన 27వ రోజు

మదనపల్లి, ప్రతీ ఇంటికి జనసేన కార్యక్రమంలో భాగంగా 27వ రోజు జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు మరియు జనసేన పార్టీ చిత్తూరు జిల్లా జనరల్ సెక్రెటరీ శ్రీమతి దారం అనిత ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి జనసేన కార్యక్రమం స్థానిక సరస్వతి నగర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఫామ్ 6 ద్వారా కొత్త ఓటర్ నమోదు అలాగే ఉన్న ఓటును లింక్ ద్వారా పరిశీలించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తులసి శ్రీనివాసులు, ధరణి, కాలేశా మస్తాన్ శాంతమ్మ, పార్వతి, శకుంతల, లక్ష్మీదేవి, రమణమ్మ మరియు పెద్ద ఎత్తున వీర మహిళలు, తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.