పెందుర్తి రామచంద్రరావుకి నివాళులు అర్పించిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తండ్రి రామచంద్రరావు ఇటీవల స్వర్గస్తులయ్యారు. పెందుర్తి వెంకటేష్ కుటుంబ సభ్యులను కలిసి పెందుర్తి రామచంద్రరావు చిత్రపటానికి రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.