కొల్లాయివలస గ్రామంలో గడపగడపకు జనసేన

నెల్లిమర్ల నియోజకవర్గం: పూసపాటిరేగ మండలంలోని ఏరుకొండ గ్రామంలో మన ఊరిలో జనవాణి కార్యక్రమంలో భాగంగా లోకం మాధవి ప్రతిగడపకి పర్యటించి, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను తెలుసుకున్నారు. వాటిలో ముఖ్యంగా నాలుగు ఏళ్లు గడుస్తున్నా ఇంటి బిల్లులు మంజూరు అవ్వకపోవడం, అలాగే యాతపేటలో నీటి సమస్య, సరైనటువంటి రోడ్లు కానీ కాలువలు కానీ లేకపోవడం వంటి సమస్యలు గ్రామస్తులు మాధవి దృష్టికి తీసుకొని వచ్చారు. సమస్యలు విన్న మాధవి ఆ సమస్యలపై వినతిపత్రం సంబంధిత అధికారులకు ఇచ్చి బాధితులకి న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. అలాగే జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసుని మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లారు. ఈ కార్యక్రమంలో పూసపాటి రేఖ మండల అధ్యక్షులు జలపారి శివదొర, గుడివాడ జెమ్మి రాజు, జి శ్రీనివాస్ ఎస్ శ్రీనివాసరావు జి త్రినాథ్ సిహెచ్ శ్రీనివాస్ మరియు తదితరు జనసేన వీర మహిళలు పాల్గొన్నారు.