800 పేద ముస్లిం మహిళా కుటుంబాలకు జనసేన తోఫా

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొని సుమారు 800 పేద ముస్లిం మహిళా కుటుంబాలకు తోఫాని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అతి పవిత్రమైన రంజాన్ మాసంలో కఠిన ఉపవాసం చేస్తూ ఎంతో నియమ నిష్ఠలతో ఉంటారని అన్నారు. ఇటీవల జనసేన అధినేత ఇస్లాం విద్య, ధార్మిక సంస్థలు, ప్రార్థన స్థలాలకు 25 లక్షలు రూపాయలు విరాళంగా అందించడం ఆనందదాయకమని తెలిపారు. వైసిపి ముస్లింలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. జనసేన ఖచ్చితంగా ముస్లింలకు అండగా ఉంటుందని వచే ఎన్నికలలో ఒక అవకాశమివ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అలాగే గుంటూరు జిల్లా నాయకులు పాల్గొన్నారు.