హిందూపురం గ్రామంలో జనసేన గ్రామ బాట

పార్వతీపురం నియోజకవర్గం: గంగాపురం పంచాయతీ, హిందూపురం గ్రామంలో జనసేన గ్రామ బాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం పార్వతీపురం మండల జనసేన అధ్యక్షురాలు శ్రీమతి ఆగూరు మణి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పార్వతిపురం నాయకులు అక్కివరపు మోహన్ రావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాబోయే ఎన్నికల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పార్టీ సిద్ధాంతాలు అలాగే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలుచేసే విది విదానాలు
గ్రామంలో ప్రజలకి వివరించడం జరిగింది. ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అవినీతి పాలనా విధానాన్ని ప్రజలకి క్లుప్తంగా వివరించడం జరిగింది. హిందూపురం గ్రామంలో ప్రజల స్పందన చూసి రాబోయే ఎలక్షన్ లో జనసేన పార్టీ పార్వతిపురం నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బొబ్బిలి మండల అధ్యక్షులు గంగాధర్, బలిజిపేట మండల అధ్యక్షులు బంకురు పోలినాయుడు, అలాగే పార్వతిపురం జిల్లా నాయకులు ఖాతా విశ్వేశ్వరరావు, చిట్లి గణేష్, గుండ్రెడ్డి గౌరీ శంకర్, అల్లు రమేష్, స్వామి నాయుడు, అప్పలనాయుడు, కర్రి మణికంఠ, అన్నేబత్తుల దుర్గాప్రసాద్, సంజు, గార గౌరీ, భాస్కర్, కనకరాజు, చంద్రశేఖర్, పైళ్ల అప్పలరాజు, ఇప్పిలి పోలినాయుడు, ఇప్పిలి శంకర్రావు, దుర్గ, కేశ్వరరావు, మహేష్, తదితరులు పాల్గొన్నారు.