ఘనంగా ప్రారంభమైన శ్రీమతి భానుమతి నర్సింగరావు స్మారక మహిళ క్రికెట్ టోర్నమెంట్..

ఇచ్చాపురం: శ్రీమతి భానుమతి నర్సింగరావు స్మారక మహిళ క్రికెట్ టోర్నమెంట్.. ఇచ్చాపురం క్రికెట్ క్లబ్ ఐసీసీ అధ్యక్షులు దాసరి రాజు, చీఫ్ కోచ్ గోపి ఆధ్వర్యంలో శుక్రవారం సురంగి రాజావారి మైదానంలో మహిళా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ మహిళా క్రికెట్ టోర్నమెంట్ కు హైదరాబాద్ జిఎన్ఆర్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ సామినేని గోపాల్ రావు వారి తల్లిదండ్రులు శ్రీమతి భానుమతి నరసింహరావు స్మృతి అర్థం ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం క్రికెట్ క్లబ్ అధ్యక్షులు జిఎన్ఆర్ క్రికెట్ క్లబ్ డైరెక్టర్ సామినేని గోపాల్ రావు, ఐసీసీ క్రికెట్ క్లబ్ మెడికల్ అడ్వైజర్ శ్రీ ఉలాల శేషు యాదవ్, శ్రీ సరోజ్ కుమార్ గౌడ, పైడిసెట్టి దినేష్, రోటరీ క్లబ్ నెంబర్ రామారావు, మొదలైన వారు ప్రారంభ వేడుకలులో పాల్గొన్నారు. ఈరోజు మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ఒరిస్సా ఆల్ఫా క్లబ్ వారు 90పరుగులు చేశారు. తదుపరి బ్యాటింగ్ చేసిన శ్రీకాకుళం మహిళా జట్టు 82 పలుకులు చేశారు. ఈ మ్యాచ్లో బెస్ట్ బ్యాట్స్మెన్ గా శ్రీలత, బెస్ట్ బౌలర్ సరయు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా మోనాలిసా బిస్వాలను ఎంపిక చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్ ప్రసాద్ చేతుల మీదుగా విజేతలు అందరికీ బహుమతులు అందజేయడం జరిగింది.