ఈసారి జనసేనకు అవకాశం ఇవ్వండి గ్రామ పెద్దలతో భేటి: కరిమజ్జి

ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, సూర్యనారాయణపురం గ్రామం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆదివారం ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం సూర్యనారాయణపురం గ్రామంలో మాట్లాడుతూ జనసేనకు ఈసారి అవకాశం ఇవ్వాలని అలాగే జనసేన పార్టీ సిద్దాంతాలను పవన్ కళ్యాణ్ ఆదర్శాలను మరియు ఆచరించే విధానాలను ప్రజలకు కరిమజ్జి మల్లీశ్వరరావు వివరించడం జరిగింది. టిడిపి, వైసీపీ ప్రభుత్వ పాలన చూశారు, ఒక్కసారి అవకాశం ఇచ్చి జనసేన పార్టీ పాలన కూడా ప్రజలు చూడాలని ఆయన కోరారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల వారికి మేలు చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కి వచ్చే ఎన్నికల్లో జనసేనపార్టీకి ఓటు వేయాలని కరిమజ్జి మల్లీశ్వరరావు మరియు పోట్నూరు లక్ష్మునాయుడు, కోరడమైనది. ఈ కార్యక్రమంలో జనసైనికులు శ్రీరామ్, నారాయణరావు, రమేష్ మరియు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.