పూతలపట్టులో జనసేన పల్లెబాట

జనసేన పల్లెబాటలో భాగంగా 30 మంది యువత పార్టీలో చేరిక

చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్ ఆదేశాల మేరకు నెల్లిమంద పల్లిలో జనసేన పల్లె బాట కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు పురుషోత్తం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పార్టీ సిద్ధాంతాలకు, పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి సుమారు 30 మంది యువత పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నెల్లిమంద పల్లి యువకులు మాట్లాడుతూ పార్టీకి ఎల్లవేళలా అండగా ఉంటూ, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజలకు వివరిస్తామని, జనసేన పార్టీ యువతకు మంచి భవిష్యత్తు కల్పిస్తుందని నమ్మి పార్టీలో చేరుతున్నట్లు తెలియజేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ మాట్లాడుతూ.. జనసేన పల్లెబాట కార్యక్రమం ప్రజల ఇబ్బందులను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని, అలాగే ప్రతి ఊరిలో పార్టీ బలోపేతం చేయగలుగుతున్నామని, ఈ కార్యక్రమాన్ని పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్న మిగతా మండలాల్లో కూడా నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తులసి, వాసు రాయల్, కార్యదర్శులు రెడ్డప్ప, పూర్ణ, వినోద్ నాయకులు మైలారి వినయ్, భాను, కిరణ్, మోహన్ రాజ్, హేమ చంద్ర, తిరుమలేష్, ప్రేమ్, సునీల్, రెడ్డి, సుదర్శన్, అంజి, నవీన్, మనోజ్ పాల్గొన్నారు.