మునుగోడు లో పర్యటించిన నియోజకవర్గ కో ఆర్డినేటర్ గోకుల రవీందర్ రెడ్డి

మునుగోడు నియోజకవర్గం చండూరు, మర్రిగూడెం మండలాలలో పర్యటించిన జనసేన పార్టీ మునుగోడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ గోకుల రవీందర్ రెడ్డి ఈ సందర్భంగా మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ముఖ్యనాయకుల ఆత్మీయ సమావేశాల్లో పాల్గొని నియోజకవర్గంలో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉస్మానియా నాయకులు మహేష్ పెంటల, మండలాల నాయకులు చంద్రకాంత్, వేణు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.