జనసేన పల్లెబాట కార్యక్రమం

చిన్నగంజాం మండలం జనసేన పార్టీ పల్లెబాట కార్యక్రమం పల్లెపాలెం పంచాయితీ బాపయ్య నగర్ లో.. కొత్తపాలెం పంచాయతీ రామచంద్ర నగర్ లో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపూడి విజయకుమార్ మరియు పర్చూరు నియోజకవర్గ యువ నాయకులు మన్యం శ్రీకాంత్ ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. కొంతమంది మత్స్యకారులు సమస్యను వివరించగా దాదాపుగా ఐదు కుటుంబాలకు సంబంధించిన వలలు అన్ని 30 లక్షలు విలువచేసే వలలోవారి కాలిపోయాయి దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు.. మా సమస్యల అధికారులు దృష్టికి తీసుకెళ్లి వెంటనే రిష్కరించాలని శ్రీకాంత్ ను స్థానిక మహిళలు కోరారు. సమస్యలు తెలియజేయగా వాటిని వెంటనే పరిష్కరిస్తామని శ్రీకాంత్ వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం చిన్నగంజాం మండల అధ్యక్షులు సందు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి చిరంజీవి, జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ సతీష్, తోట అశోక్ చక్రవర్తి, గంట వెంకటేష్, నోవా, అడుసుమల్లి హరిబాబు, కోకిలగడ్డ శీను, వీరమహిళ గున్నమనేని విజయశాంతి, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.