జనసేన పార్టీ గ్రామ స్థాయి కమిటీ నియామకం

నరసాపురం మండలం, సీతారామపురం నార్త్ మరియు సౌత్ పంచాయితీల జనసేన పార్టీ గ్రామ స్థాయి కమిటీ నియామకం జరిగింది. ఈ కమిటీ లో సీతారామపురం సౌత్ గ్రామ అధ్యక్షులుగా ఇంటి మురళి, ఉపాధ్యక్షులుగా పెనుగొండ శ్రీనివాసు, మేడిది నారాయణమూర్తి, గ్రామ యువత అధ్యక్షులుగా వాస్కూరి బద్రి, సీతారామపురం నార్త్ అధ్యక్షులుగా గంగిపాముల వెంకటరత్నం నాయుడు, ఉపాధ్యక్షులుగా దొంగ మూర్తి, పులపర్తి సురేష్, చినిమిల్లి గోపీ, యువత అధ్యక్షులుగా అదబాల మణి లను నూతన కార్యవర్గంగా గ్రామ నాయకులు ఎంపిక చేశారు. తదనంతరం జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్, కోటిపల్లి వెంకటేశ్వరరావు, కొల్లాటి గోపీకృష్ణ, వాతాడి కనకరాజు, బందెల రవీంద్ర, వలవల నాని, గంటా కృష్ణ, జక్కం బాబ్జి, తోట నాని, దివి సత్యం, బందెల ఎలీషా, నిప్పులేటి తారకరామారావు, అందే దొరబాబు, బొమ్మిడి కృష్ణమూర్తి, గణేశ్న శ్రీరామ్, కొండవీటి పద్మరాజు, రావి దొరబాబు, అడబాల బాబు, మందపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.