ఏజన్సీ సుద్దగొమ్ము గ్రామంలో మొక్కలు పంపిణీ చేసిన జనసేన

రంపచోడవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతం ప్రకారం గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయటానికి కృషి చేయాలని నిరంతరం పార్టీకి కృషి చేసే తూర్పుగోదావరి జిల్లా ఇంచార్జ్ శ్రీ కందుల దుర్గేష్ సలహా మేరకు, జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పాటంశెట్టి సూర్యచంద్ర ను ఆదర్శంగా తీసుకుని నిరంతరం నాకు వెన్నటు నేనున్నా అని నిలబడే శ్రీ కాకి స్వామి సూచనలతో శ్రీ పవన్ కళ్యాణ్ 2019లో మొట్టమొదటిసారి సందర్శించిన ఏజన్సీ సుద్దగొమ్ము గ్రామంలో స్వచ్చందంగా గ్రామ అభివృద్ధికై ఇంటికి పది మొక్కలచప్పున రెండు వందల జీబ్రా మొక్కలను పంపిణీ చేసి గ్రామస్థులకు జనసేన పార్టీని బలోపేతం చెయ్యమని, తద్వారా గ్రామాలు ఎలా అభివృద్ధి జరుగుతుందో వివరించటం జరిగింది. ఈ కార్యక్రమం దేవిపట్నం తొయ్యరు గ్రామ జనసైనికుడు జనసేన రాయుడు ఆధ్వర్యంలో నెతునూరి నాగేంద్ర, మరక తరుణ్, మనోజ్, చామకూరి మణికంఠ, తైలం రమేష్, గోకవరం జనసైనికుడు ఆమోస్ తదితరులు పాల్గొన్నారు.