ఒక్కసారి పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇవ్వాలి: రాందాస్ చౌదరి

మదనపల్లి నియోజకవర్గం, కొత్తవారిపల్లి పంచాయితీ, మంగళవారం జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి కొత్తవారిపల్లిలో ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొత్తవారిపల్లి ప్రజలు బాణాసంచా పేల్చి ఘన స్వాగతం పలికారు. జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్, ముకేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి సమక్షంలో జనసేన నాయకులు, కార్యకర్తలు వీరమహిళలతో కలసి గడప గడపకి జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ ఆశయాలు, గాజు గ్లాసు గుర్తును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం జరిగింది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇవ్వాలని గ్రామంలో ప్రతి గుమ్మానికి తిరిగి జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర,పట్టణ ప్రధాన కార్యదర్శి రెడ్డెమ్మ, తెలుగుదేశం నాయకులు సురేంద్ర, రవికుమార్, శ్రీనివాసులు రెడ్డి, రూరల్ ఉపాధ్యక్షులు కుమార్, నవాజ్, జనార్దన్, సమరసింహా రెడ్డి, రెడ్డి, సత్య, దినకర్, అక్షయ్ తదితురులు పాల్గొన్నారు.