జనసైనికుడికి మనోధైర్యాన్నిచ్చిన జనసేన NRI సేవా సమితి

చిత్తూరు జిల్లా పీలేరు కు చెందిన జన సైనికుడు యస్.మస్తాన్ బాషాకి రోడ్డు ప్రమాదంలో అతని కాలు తీసివేయడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అతనికి యస్.మస్తాన్ బాషాకి జనసేన NRI సేవా సమితి ద్వారా చిత్తూరు జిల్లా జనసేన కార్యదర్శి కలప రవి మరియు జనసేన ఎన్నారై సేవాసమితి అధ్యక్షులు రామచంద్ర నాయక్ చేయూతతో రూపాయలు 25000 ఆర్థిక సహాయం అందజేశారు. జనసైనికులకు ఎలాంటి కష్టం వచ్చినా జనసేన పార్టీ తోడుగా ఉంటుందని మస్తాన్ కుటుంబానికి ధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా దామోదర్ నాయుడు పాల్గొనగా పీలేరు జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పవన్, నాయకులు చరణ్, రాకేష్, మహేష్, గజేంద్ర, ధనశేఖర్, దిలీప్ కుమార్, పవన్, మోహన్, శివ, మున్నా గౌష్, కేశవ, షపీ , అఖిల్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.