హుజూర్నగర్ జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

హుజూర్నగర్ నియోజకవర్గ కార్యనిర్వాహకులు సరికొప్పుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో హుజుర్నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని స్థానిక దుర్గమ్మ గుడి పూజారి మోలుగు శ్రీనివాసాచార్యులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హుజూర్నగర్ నియోజకవర్గ జనసైనికులు జంపాల అనిల్ నాయుడు, రాకేష్, దాసరి వాసు నాయుడు, కొమ్మరాజు శ్రీను, చారీ నాగ, చందు, ఆనంద్, వెంకట్, నరసింహ చారీ, సతీష్, నరేష్, మరియు కోదాడ నియోజకవర్గ నాయకులు కుడుముల ప్రశాంత్, బాదే అంజి, కస్తూరి సురేష్ జనసైనికులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.