జనసైనికుని కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన జనసేన

నర్సన్నపేట, యరాబాడు పంచాయతీ, లింగలపాడు జనసైనికుడు యరాబాటి రమణమూర్తి కి ఇటీవల యాక్సిడెంట్ అయ్యి కాళ్ళకు ఆపరేషన్ జరిగింది. డాక్టర్లు 45 రోజులు నడవకూడదని చెప్పారు. తండ్రి లేరు అన్నదమ్ములు లేరు కొడుకు కష్టపడి రూపాయి తెస్తే కానీ తినలేని పేద కుటుంబం అవ్వడం వల్ల, ఇబ్బందులకు గురవుతున్నారని, జనసైనికుడు సత్య తెలుసుకొని పనుతుల జయరాం దృష్టికి తీసుకురాగా… ఆ కుటుంబాన్ని పరామర్శించి 10000 రూపాయలు ఆ జనసైనికుడు తల్లికి అందజేసి నా తమ్ముడు రమణ లేచి పనికి వెళ్ళేవరకు ఈ ఇంటికి ఉన్న అన్ని ఖర్చులకి నేను చూసుకుంటానని మరియు అన్ని విధాలుగా జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో లింగలపాడు జనసైనికులు పాల్గొన్నారు.