రోడ్ల దుస్థితి పై కలెక్టర్ కి జనసేన వినతిపత్రం

ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం గతంలో అదపాక జంక్షన్ నుండి పైడావలస వరకు వెళ్ళే ప్రధాన రహదారి సగం రోడ్డువేసి వదిలేయడం వలన అవి పూర్తిగా గుంతలు పడి, గుర్రాలపాలెం, పాతకుంకాం, కొత్తకుంకాం గ్రామ మధ్య.. వాహన దారులు, ప్రజలు రాకపోకలకు తీవ్రంగా అంతరాయం కలుగుతుందని, ఈ సమస్యను వీలైనంత వేగంగా పరిష్కారం చెయ్యగలరని కోరుతూ సోమవారం శ్రీకాకుళం జిల్లాలో స్పందన కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ కి ఆర్&బి యస్ సి కి జనసేన పార్టీ నాయకులు బార్నాల దుర్గారావు, దొర రాజారమేష్, సూర్య, గ్రామ ప్రజలు వినతిపత్రం అందజేశారు.