జనసేన పోరాటంతో బస్సు సర్వీస్ పునరుద్దరణ

శ్రీకాకుళంనుండి వయా పొందూరు, దేవరావలస, వెలగాఢ, జి. సిగడాం, మీదుగా రాజాం ప్రయాణించే బస్సు గత 3సంత్సరాలు గా ఆగిపోయింది. ఈ విషయంపై ఆ యా గ్రామాల ప్రజలు, విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నందున శ్రీకాకుళం ఆర్టీసీ మేనేజర్ కి జనసేన ఎచ్చెర్ల నియోజకవర్గం టీం తరుపున లావేరు మండల
నాయకులు వడ్డిపల్లి శ్రీనివాస్ విషయాన్ని తెలియచేసి వినతి పత్రము అందచేయటం జరిగింది. ఈ విషయంలో ఆర్టీసీ అధికారులు స్పందించి, 18.7.2022 సోమవారం నుండి బస్సు సర్వీస్ ను పునరుద్దరించటం జరిగింది. ఆ గ్రామాలలో బస్సు సర్వీస్ నడిచినందున ఆయా గ్రామాల ప్రజలు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ జనసేన టీం ను అభినందించారు. ఈ కార్యక్రమం ముందుండి నడిపించి విజయం సాధించిన వడ్డిపల్లి శ్రీనివాస్ ను ఎచ్చెర్ల జనసేన టీం తరుపున అర్జున్ భూపతి అభినందించారు. అలాగే ఆర్టీసీ అధికారులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసారు.