జనసేన గెలుపుకోసం 24X7 పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: మండపాక శ్రీను

  • జన జాగృతి యాత్ర 60వ రోజు

రాజానగరం, జనసేన జనజాగృతి యాత్ర 60వ రోజులో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం కోరుకొండ మండలం పశ్చిమగోనుగూడెం గ్రామంలో గురువారం కార్యక్రమంలో భాగంగా 300 గాజు గ్లాసులు పంపిణి చెయ్యటం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 51,600 గాజు గ్లాసులు పలు గ్రామాల్లో ఇవ్వటం జరిగింది. జనసేన జన జాగృతి యాత్ర కార్యక్రమం శ్రీకారం చుట్టిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు మండపాక శ్రీను అధ్యక్షతన దిగ్విజయంగా ముందుకు సాగుతూ రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ జండా ఎగరేసే విధంగా ముందుకు సాగిపోతుంది. గ్రామ గ్రామన ప్రతి ఇంటింకి వెళ్లి జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం కరపత్రాలను ప్రజలకు అందిస్తూ జనసేన పార్టీని కొణిదెల పవన్ కళ్యాణ్ ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ నాయకులు, తన్నీరు తాతాజీ, అడపా అంజి బాబు, పోసిబాబు, చదువు ముక్తేశ్వరరావు, చల్లా ప్రసాద్, పేమ్మడా సతీష్, కొచ్చర్ల భరత్, కొచ్చర్ల బాబి, మండపాక మురళి మరియు పశ్చిమ గోనగూడెం గ్రామ జనసేన నాయకులు, మండల ప్రధాన కార్యదర్శి విరపురాజు పోసిబాబు, గ్రామ కమిటీ ప్రెసిడెంట్ రాచపోతుల సురేష్ టి.వీరబాబు, డి.గోపి, కె.శ్రీను తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.