ఒంగోలులో జనసేనాని జన్మదిన వేడుకలు

ఒంగోలు, జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ఒంగోలులో 38వ డివిజన్ లో డివిజన్ కార్పొరేటర్ మరియు ఒంగోలు నగర అధ్యక్షులు మలగా రమేష్, జిల్లా కార్యదర్శి రాయని రమేష్, 38 వ డివిజన్ అధ్యక్షులు ఆలా నారాయణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కేక్ కటింగ్ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మరియు జనసేన పార్టీ సంతనూతలపాడు సీనియర్ నాయకులు కందుకూరు వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి చలపతి రాంబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, నగర కమిటీ సభ్యులు, డివిజన్ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు, వీర మహిళలు మరియు 38వ డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి నందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.