రోడ్లు దుస్థితి పై జనసేన డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా పోరాటం

అనకాపల్లి జిల్లా, మాడుగుల నియోజకవర్గం, మాడుగుల మండలం ఘాటీరోడ్ జంక్షన్ నుంచి మాడుగుల వెళ్లే రహదారి దుస్థితి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మాడుగుల నియోజకవర్గం మాడుగుల మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్ హ్యాస్ ట్యాగ్ తో ముఖ్యమంత్రి కి తెలిసేలా ఆధ్వనంగా ఉన్న ఘాటీరోడ్ జంక్షన్ నుంచి మాడుగుల వెళ్లే రహదారి గుంతల రోడ్లు వద్ద డిజిటల్ క్యాంపైన్ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాడుగుల మండల జనసైనికులు మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నా ఈ రోజుకి రోడ్లు పరిస్థితి అధ్వానంగా ఉన్న పట్టించుకోకుండా గాఢ నిద్రలో ఉన్న సీఎం నిద్ర వీడి ప్రజల సొమ్మును పథకాలు పేరిట దుర్వినియోగం చెయ్యకుండా ఇకనైనా అభివృద్ధి చేయ్యలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గండెం రాంబాబు, రౌతు ప్రసాద్, కలిపిరెడ్డి రాజా(కె.ఆర్), దయా యాదవ్, అభి, దాసరి అచ్యుతరావ్, గుమ్మాల అప్పలనాయుడు, దొర నాగేష్, పాము నాగరాజు, పిల్లి శివ, యేసు రాజు తదితరులు పాల్గొన్నారు.