సమస్యలను పరిష్కరించడమే జనసేన లక్ష్యం, ప్రతి అర్హుడుకి పెన్షన్ అందాలి

కార్వేటినగరం మండలం ఆర్కే.వి.బి. పేట పంచాయతీలో, 20 నెలల పైగా వృద్ధాప్య పెన్షన్, ఎనిమిది నెలలుగా వితంతు పెన్షన్ అర్హులకు అందలేదని పంచాయతీలో కొన్ని సమస్యల పైనసమస్యల గురించి మంగళవారం ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లిన జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి మెదవాడ రాఘవ. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పెన్షన్ను ప్రతి ఒక్క అర్హులకు అందించాలని కోరడం జరిగింది. నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ప్రతి ఒక్కరికి తగిన సమయంలో పెన్షన్ అందించాలని తెలిపారు. ఈ విషయంపై ఎంపీడీవో స్పందిస్తూ తొందరలోనే అర్హులకు పెన్షన్ అందిస్తామని తెలిపారు.